యూపీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మూడు ర్యాంకులు

by Disha Web Desk 23 |
యూపీఎస్సీ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లాకు మూడు ర్యాంకులు
X

దిశ,వరంగల్ కలెక్టరేట్ : యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫైనల్ ఎగ్జామ్స్ 2023 ఫలితాలను మంగళవారం ఏప్రిల్ 16 2024 న కమిషన్ అధికారిక వెబ్సైట్ upsc.gov.in, upsconline.nic.in లో విడుదల చేసింది. ఈ ఫలితాల్లో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ముగ్గురికి ర్యాంకులు కైవసం చేసుకున్నారు. టౌన్ కు చెందిన జయసింహ రెడ్డి కి 103 ర్యాంక్, గీసుకొండ మండలం అనంతరం గ్రామానికి చెందిన సయింపు కిరణ్ కి 568 ర్యాంక్, శివనగర్ కు చెందిన కోట అనిల్ కుమార్ 764 ర్యాంకులు సాధించారు. అయితే వారికి వచ్చిన ర్యాంక్స్ ను పరిశీలిస్తే జయసింహారెడ్డికి ఐఏఎస్, కిరణ్ కు ఐపీఎస్, అనిల్ కుమార్ కు ఐఆర్ఎస్ వచ్చే ఛాన్స్ ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీంతో విజేతల కుటుంబాలకు బంధువులు స్నేహితులు పలువురు అభినందనలు తెలుపుతున్నారు.


Next Story