పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు

by Aamani |
పోలీసుల ఎదుట లొంగిపోయిన మావోయిస్టు దంపతులు
X

దిశ,హన్మకొండ : హన్మకొండ జిల్లా హసన్పర్తి మండలం సుదం పల్లి గ్రామానికి చెందిన తిక్క సుస్మిత (27) ఇంటర్మీడియట్ వరకు చదువుకుంది. తన తండ్రి తిక్క సుధాకర్ మావోయిస్టు సానుభూతిపరుడుగా పనిచేశాడని అతన్ని చూసి ఆకర్షితురాలైన సుస్మిత తన చదువు అనంతరం 2016 వ సంవత్సరంలో ఛత్తీస్ గడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిల్లా కోమటిపల్లి గ్రామ అటవీప్రాంతంలో బడే చొక్కారావు @ దామోదర్ సమక్షంలో మావోయిస్టు పార్టీలో చేరింది.

ఛత్తీస్ గఢ్ రాష్ట్రం సుకుమా జిల్లా , పరియా గ్రామానికి చెందిన మడకం దూల @ దూల ఐదో తరగతి వరకు చదువుకున్నాడు. తన అన్నయ్య అయినా ఐయత 2008 సీపీఐ మావోయిస్టు పార్టీలో చేరాడని, అతన్ని చూసి ఆకర్షితుడైన దూల 2015 వ సంవత్సరంలో ఏరియా కమిటీ మెంబర్ అయిన జోగి ప్రోత్సాహంతో సిపిఐ మావోయిస్టు పార్టీలో చేరాడు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న సమయంలో వీరిద్దరి మధ్య పరిచయం ఏర్పడి 2020 మార్చి నెలలో 30 వ తేదీన వివాహం చేసుకున్నారు. తరువాత వివిధ హోదాల్లో పలు చోట్ల పనిచేసారు. మావోయిస్టు సిద్ధాంతాలపై నమ్మకం కోల్పోయి, తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన పునరావాస పథకం గురించి తెలుసుకుని ఆకర్షితులైన వీరిరువురు ఈ రోజు వరంగల్ పోలీసుల ఎదుట లొంగిపోయారు. వీరిరువురికి ఒక్కొక్కరికి రూ. నాలుగు లక్షల నగదు రివార్డు ఉన్నదని ఆ మొత్తాన్ని బ్యాంకు డీడీ రూపంలో వారికి అందజేశారు.

Advertisement

Next Story