- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
Home > జిల్లా వార్తలు > వరంగల్ > వరంగల్ బస్స్టేషన్లో ప్రయాణికుల అవస్థలు.. ఆరు తర్వాత బస్సులుండటం లేదని జనం ఆగ్రహం
వరంగల్ బస్స్టేషన్లో ప్రయాణికుల అవస్థలు.. ఆరు తర్వాత బస్సులుండటం లేదని జనం ఆగ్రహం
by Disha Web Desk 23 |
X
దిశ, వరంగల్ : వరంగల్ బస్టాండ్ లో బస్సుల కోసం వేములవాడ, కరీంనగర్, హుజురాబాద్ రూట్లో బస్సు సర్వీసుల్లేక మంగళవారం రాత్రి సమయంలో వరంగల్ బస్ స్టేషన్లో గంటల తరబడి పడిగాపులు గాచారు. చిన్నారులతో ఉన్న మహిళా ప్రయాణికుల అవస్థలయితే వర్ణనాతీతం. గత కొద్దిరోజులుగా ఆర్టీసీ పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ల సర్వీసులను అధికారులు తగ్గించేయడంతో అవస్థలపాలవుతున్నామంటూ పలువురు ప్రయాణికులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. సాయంత్రం ఆరు తర్వాత కరీంనగర్, నిజామాబాద్ వైపు వెళ్లే బస్సులు ఉండటం లేదని, అలాగే ఖమ్మం, మహబూబాబాద్, భద్రాచలం వెళ్లే బస్సులు కూడా రెండు గంటలకో సర్వీసు అన్నట్లుగా నడుస్తున్నాయని ప్రయాణికులు మండిపడుతున్నారు.
Next Story