ఛత్తీస్‌ఘ‌డ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతులు వీళ్లే..

by Disha Web Desk 23 |
ఛత్తీస్‌ఘ‌డ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌.. మృతులు వీళ్లే..
X

దిశ,ఏటూరునాగారం: ఛత్తీస్‌ఘ‌డ్‌ రాష్ట్రం, బ‌స్తార్‌లోని కాంకేర్ లో భ‌ద్ర‌త బ‌ల‌గాల‌కు, మావోయిస్టుల‌కు భారీ ఎన్‌కౌంట‌ర్ చోటుచేసుకుంది. కాంకేర్ జిల్లా చోటేబైధియా పోలిస్ స్టేష‌న్‌ ప‌రిధిలోని క‌ల్ప‌ర్ అడ‌విలో భ‌ద్ర‌త బ‌ల‌గాలు కూంబింగ్ నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో మావోయిస్టులకు, భ‌ద్ర‌త బ‌ల‌గాల‌కు ఎన్‌కౌంట‌ర్ జ‌రిగింది. ఈ ఎన్ కౌంట‌ర్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 18 మంది మావోయిస్టులు మృతి చెందిన‌ట్లు స‌మాచారం. భ‌ద్ర‌త బ‌ల‌గాల‌కు, మావోయిస్టుల‌కు జ‌రిగిన ఎన్‌కౌంట‌ర్ లో మావోయిస్టు ద‌ళ క‌మాండ‌ర్ శంక‌ర్ రావు మృతి చెందిన‌ట్లు ఎస్పీ క‌ళ్యాన్ ఎలిసెలా ధృవీక‌రించారు. కాగా ద‌ళ కమాండ‌ర్ శంక‌ర్ రావు పై 25 ల‌క్ష‌ల రివార్డు ఉంది. ఈ ఎన్ కౌంట‌ర్‌లో ఒక‌ ఇన్స్పెక్ట‌ర్‌, ఇద్ద‌రు బీఏస్ఏఫ్ జ‌వాన్లు గాయ‌ప‌డిన‌ట్లు స‌మాచారం. ఎన్‌కౌంట‌ర్ జ‌రిగిన ఘ‌ట‌న స్థ‌లం నుండి 4 ఏకే 47, రైఫిల్స్, భారీ మొత్తంలో ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు. కాగా ఈ ఘటనకు సంబందించిన వివ‌రాలు తెలియాల్సి ఉంది.


Next Story

Most Viewed