కడియం కావ్య గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలి : పాలకుర్తి ఎమ్మెల్యే

by Disha Web Desk 23 |
కడియం కావ్య గెలుపు కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త కృషి చేయాలి : పాలకుర్తి ఎమ్మెల్యే
X

దిశ,రాయపర్తి : వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపు కోసం ప్రతి ఒక్క కార్యకర్త కృషి చేయాలని పాలకుర్తి ఎమ్మెల్యే మామిండ్ల యశస్విని రెడ్డి కోరారు. గురువారం మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఆవరణలో మండల ముఖ్య కార్యకర్తల తో ఎమ్మెల్యే యశస్వి రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రజారంజక పాలన కొనసాగుతుందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించి పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలి అన్నారు వరంగల్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కడియం కావ్యను అధిక మెజార్టీతో గెలిపించేందుకు ప్రతి కార్యకర్త కృషి చేయాలన్నారు.

మండలంలోని ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకురావాలని సమస్యల పరిష్కారం కోసం తన వంతు కృషి చేస్తానన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సోనియా గాంధీ ఆధ్వర్యంలో దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుందని రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అవుతారన్నారు. పాలకుర్తి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ మెజార్టీ అందించి కావ్య గెలుపును ఖాయం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు జాటోత్ హామ్య నాయక్, మండల అధ్యక్షుడు ఈదులకంటి రవీందర్ రెడ్డి, పాలకుర్తి దేవస్థానం కమిటీ చైర్మన్ కృష్ణమాచార్యులు, నాయకులు మాచర్ల ప్రభాకర్, రెంటాల గోవర్ధన్ రెడ్డి, పెండ్లి మహేందర్ రెడ్డి, కృష్ణారెడ్డి, మంద యాకోబు రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.



Next Story

Most Viewed