వ‌రంగ‌ల్ ఎంపీగా పోటీ చేస్తున్న‌ : మంద నరేష్

by Disha Web Desk 23 |
వ‌రంగ‌ల్ ఎంపీగా పోటీ చేస్తున్న‌ : మంద నరేష్
X

దిశ‌,కేయూ క్యాంప‌స్ : వరంగల్ పార్లమెంటు ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నట్లు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి ఉద్యమకారుడు ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు మంద నరేష్ తెలిపారు. హనుమకొండలోని కాకతీయ విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ.. వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో రాజకీయ పార్టీలు కాకతీయ యూనివర్సిటీ తెలంగాణ ఉద్యమకారులకు ఎంపీ టికెట్స్ నీ ప్రకటించకపోవడం సిగ్గుచేటని మంద నరేష్ అన్నారు. తెలంగాణా స్వరాష్ట్రం కోసం పోరాడిన ఉద్యమకారులను వివిధ రాజకీయ పార్టీలు ఎంపీ టికెట్స్ నీ ఇవ్వకుండా మోసం చేయడం జరిగిందని అన్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పార్లమెంట్ ఎన్నికల్లో నాకు అండగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో విద్యార్థి నాయకులు అరిస్టాటిల్, వివేకానంద, సిద్దు, నవీన్, కిరణ్, సాయి, వెంకటేష్, సందీప్, కళ్యాణ్, సురేష్ ,రాజు, రమేష్ ,నరేందర్, సూర్య, దిలీప్, శివ, తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed