కొండా,రేవూరి వర్గీయుల మధ్య ఘర్షణ..పరకాల పార్టీ సమావేశంలో రసాభాస

by Disha Web Desk 23 |
కొండా,రేవూరి వర్గీయుల మధ్య ఘర్షణ..పరకాల పార్టీ సమావేశంలో రసాభాస
X

దిశ, హనుమకొండ టౌన్ : హనుమకొండ జిల్లా పరకాల పట్టణంలోని శివారులో గల లలిత కన్వెన్షన్ హల్ లో ఆదివారం పరకాల నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఆ క్రమంలో లలిత కన్వెన్షన్ హల్ చివరి నుంచి కొండ వర్గీయులు గజ్జి విష్ణు జై కొండా అంటూ విస్తృత స్థాయి సమావేశం లోకి వెళ్లారు. కొండా మురళి, కొండా సురేఖ ను పరకాల ఎమ్మెల్యే రేవూరి పట్టించుకోవడం లేదని, ఈ విస్తృత స్థాయి సమావేశం వారు లేకుండా ఎలా చేస్తారు అని ఆందోళనకు దిగారు. కొండా మురళీ వర్గీయులు, స్థానిక ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రాధాన్యత ఇవ్వడం లేదంటూ కొండా మురళి సురేఖ రాకుండా కార్యక్రమం నిర్వహించడం పట్ల కొండ వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

సమావేశం మందిరంలోకి జై కొండా అంటూ నినాదాలు చేస్తూ కొండా వర్గీయులు రావడంతో స్థానిక కార్యకర్తలు కు కొండా వర్గీయులకు మధ్య తీవ్ర వాగ్వాదం తోపులాట చోటుచేసుకుంది. వెంటనే స్థానిక పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనకారులను చెదరగొట్టి ఆందోళన చేస్తున్న గజ్జి విష్ణు ను అదుపులోకి తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన కొండా వర్గీయులు గజ్జి విష్ణు ను విడుదల చేయాలంటూ, లేనిచో రోడ్డుపై ఆందోళనకు దిగుతామని చెప్పడంతో పరకాల ఏసీపీ కార్యాలయంలో గజ్జి విష్ణు తో మాట్లాడి పోలీసులు విడుదల చేయడంతో గొడవ సద్దుమణిగింది.


Next Story

Most Viewed