- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అవినీతికి కేరాఫ్ అడ్రస్ అరూరి రమేష్.. : కడియం కావ్య
దిశ,హనుమకొండ టౌన్ : అవినీతికి కేరాఫ్ అడ్రస్ అరూరి రమేష్ అని , మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించండి అని వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య అన్నారు. గురువారం తెలంగాణ రాష్ట్ర, ఉమ్మడి వరంగల్ జిల్లా రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో హాసన్ పర్తి ఎర్రగట్టు వద్దగల కె ఎల్ ఎన్ కన్వెన్షన్ హాల్లో తెలంగాణ రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి రెడ్డి కృతజ్ఞత సభలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ కడియం కావ్య పాల్గొన్నారు.
డాక్టర్ కడియం కావ్య మాట్లాడుతూ.. రెడ్డి సంక్షేమానికి సీఎం రేవంత్ రెడ్డి పెద్ద పీట వేస్తున్నారు అని, అగ్రవర్ణాల లో ఉన్న పేదలకు కూడా ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి అని, పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీగా గెలిపిస్తే రెడ్డి సంక్షేమానికి కృషి చేస్తాను అని అన్నారు. అవినీతికి కేరఫ్ అడ్రస్ అరూరి రమేష్, అరూరి రమేష్ కి ఓటు వేస్తే మన భూములు రాసిఇచ్చినట్లే అని, మీ ఇంటి బిడ్డగా నిండు మనసుతో ఆశీర్వదించండి అని కోరారు. మే 13న జరిగే ఎన్నికలలో మీ అమూల్యమైన ఓటు చేతి గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని అన్నారు.
ఎమ్మెల్యే కడియం శ్రీహరి మాట్లాడుతూ.. రెడ్డి నాయకత్వం ఆధారంగానే రాజకీయ పార్టీల మనుగడ ఉంటుంది అని, ఎక్కడ రెడ్డి నాయకత్వం బలంగా ఉంటుందో అక్కడ ఆ పార్టీ బలంగా ఉంటుంది అని అన్నారు. రెడ్డి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కే దక్కుతుంది అన్నారు. రెడ్డి సామాజిక వర్గంలో కూడా పేదలు ఉన్నారు అని, వారికి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలి అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమ న్యాయం దక్కుతుంది అన్నారు. నా రాజకీయ జీవితంలో ఎక్కడ కూడా అవినీతికి పాల్పడలేదు అని, నేను ఎలాగా నిజాయితీగా పని చేశానో నా బిడ్డ కూడా అంతే నిజాయితీగా పని చేస్తుంది అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర నాయకులు, జిల్లా నాయకులు, కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.