సీఎం రేవంత్ రెడ్డితో తీన్మార్ మల్లన్న భేటీ!

by Disha Web Desk 5 |
సీఎం రేవంత్ రెడ్డితో తీన్మార్ మల్లన్న భేటీ!
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డితో ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న భేటీ అయ్యారు. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్లొండ, పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా కాంగ్రెస్ తరుపున తనను ఎంపిక చేసినందుకు రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు రేవంత్ రెడ్డి ఆయనకు శాలువా కప్పి పుష్పగుచ్ఛం అందజేశారు.

మరోవైపు సీఎం వివాసంలో మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు ఆది శ్రీనివాస్, కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యనారాయణ రేవంత్ రెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్ధి వెలిచాల రాజేందర్ కు రేవంత్ రెడ్డి బీఫాం అందజేశారు. వీరితో పాటు ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్ధి రామసాయం రాఘురాంరెడ్డి కూడా సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. సీఎం రేవంత్ రెడ్డికి పుష్పగుచ్ఛం ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు. వారి వెంట పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పొంగులేటి సుధాకర్ రెడ్డి సహా పలువురు కాంగ్రెస్ నాయకులు ఉన్నారు.










Next Story

Most Viewed