- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- ఎన్ఆర్ఐ - NRI
- సెక్స్ & సైన్స్
- ఫొటో గ్యాలరీ
- వైరల్
- భక్తి
తెలుగు రాష్ట్రాల్లో మరో మూడు రోజులు వర్షాలే..ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ
దిశ,వెబ్డెస్క్: తెలుగు రాష్ట్రాల్లో మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాయలసీమ నుంచి మధ్య బంగాళాఖాతం వరకు సముద్ర మట్టానికి 3.1 నుంచి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు ఏర్పడిన ద్రోణి ప్రభావంతో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్, నల్గొండ, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపింది. దీంతో పలు చోట్ల పిడుగులు పడే అవకాశం ఉండడంతో రైతులు, వ్యవసాయ కూలీలు చెట్ల కిందకు వెళ్లవద్దని అధికారులు సూచించారు.
నిన్న రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసింది. ఈ క్రమంలోనే మూడు రోజులు ఏపీలో కూడా నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ శాఖ వెల్లడించింది. నైరుతి రుతుపవనాలు క్రియాశీలంగా కదులుతుండటం, ద్రోణి ప్రభావం కూడా ఉండటం దీనికి కారణమని తెలిపింది. ఉత్తరాంధ్ర మొదలు కాకినాడ, తూ.గో, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, నంద్యాల, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురవొచ్చని తెలిపింది.