కరెంట్ షాక్‌తో గ్రామ అధ్యక్షుడి మృతి.. పాడే మోసిన టీపీసీసీ సభ్యుడు

by Disha Web Desk 4 |
కరెంట్ షాక్‌తో గ్రామ అధ్యక్షుడి మృతి.. పాడే మోసిన టీపీసీసీ సభ్యుడు
X

దిశ, కోడేర్: మండలంలోని సింగాయిపల్లి గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కుందేళ్ల మల్లేష్ యాదవ్ ప్రమాదవశాత్తు పొలంలో కరెంట్ తీగలు తగిలి మరణించాడు. విషయం తెలుసుకున్న టీపీసీసీ సభ్యులు చింతలపల్లి జగదీశ్వర్ రావు అంత్యక్రియల్లో పాల్గొని పాడె మోశారు. మల్లేష్ యాదవ్ భౌతిక కాయానికి కాంగ్రెస్ పార్టీ జెండా కప్పి నివాళులర్పించారు. కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. మల్లేష్ యాదవ్ కుటుంబానికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా ఓబీసీ సెల్ అధ్యక్షులు రాము యాదవ్, కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మిద్దె శాంతయ్య, కోడేరు మండల కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, కొల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్య నాయకులు, కార్యకర్తలు అంత్యక్రియల్లో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.


Next Story

Most Viewed