- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ను హతమార్చేందుకు టెర్రరిస్ట్ ప్లాన్
దిశ, వెబ్ డెస్క్: తెలంగాణలోని పాతబస్తిలో ఎమ్మెల్యేగా ఉన్న రాజాసింగ్ నిత్యం వార్తల్లోకి ఎక్కుతుంటారు. హిందూ నేతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయనను అనేక సార్లు హతమార్చేందుకు ప్రయత్నాలు జరిగాయి. ఈ క్రమంలోనే ప్రభుత్వం ఎమ్మెల్యే రాజాసింగ్ కు ప్రత్యేక భద్రతను ఏర్పాటు చేసింది. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయనను హతమార్చేందుకు ఓ తీవ్రవాది ప్లాన్ వేశాడు. ఎమ్మెల్యే రాజాసింగ్ తో పాటు, ఢిల్లీ మాజీ బీజేపీ నేత నుపుర్ శర్మను హత్యకు ప్లాన్ చేసిన ఉగ్రవాది.. మౌలానా సోహైల్ అబును గుజరాత్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు సోహైల్ దారాల పరిశ్రమలో మేనేజర్ గా పనిచేస్తూ.. ఆ ప్రాంతంలోని ముస్లిం పిల్లలకు ఇస్లాంపై ట్యూషన్ చెబుతుంటాడు. ఈ క్రమంలోనే భారత్లో ఉగ్రవాద కార్యకలాపాలు కొనసాగించేందుకు నిందితిడికి పాకిస్తాన్ నుంచి ఆదేశాలు, డబ్బులు వచ్చేవని పోలీసులు తెలిపారు. అలాగే ఈ ఘటనకు సంబంధించిన దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పుకొచ్చారు.