MLC కవితకు శుభవార్త చెప్పిన పోలీసులు

by Disha Web Desk 2 |
MLC కవితకు శుభవార్త చెప్పిన పోలీసులు
X

దిశ, వెబ్‌డెస్క్: భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవితకు రాష్ట్ర పోలీసులు శుభవార్త చెప్పారు. ఆమె చేపట్టిన భారత్ జాగృతి దీక్షకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. ఇవాళ ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు హైదరాబాద్‌‌లోని ధర్నా చౌక్‌లో దీక్ష చేసేందుకు అనుమతి ఇచ్చారు.

కాగా, భార‌త జాగృతి దీక్షకు అనుమ‌తివ్వండంటూ నిన్న డీజీపీ రవిగుప్తాకు ఎమ్మెల్సీ క‌విత విజ్ఞప్తి చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వ నియామకాల్లో జీవో 3 వల్ల మహిళలకు రిజర్వేషన్ల అమలులో జరుగుతున్న అన్యాయంపై ఎమ్మెల్సీ క‌విత ఇవాళ దీక్ష త‌ల‌పెట్టారు. అయితే, ముందుగా కవిత దీక్షకు అనుమతి ఇచ్చేందుకు పోలీసులు ఆలోచించారు. ఈ క్రమంలో డీజీపీకి క‌విత ఫోన్‌ చేసి ఇది చాలా ముఖ్యమైన దీక్ష అని, దీంతో జీవో 3 వ‌ల్ల జ‌రిగే న‌ష్టాన్ని తెలియ‌జేసే అవ‌స‌రం ఉంద‌ని రిక్వెస్ట్ చేయడంతో పాటు శాంతియుతంగానే తాము దీక్ష చేప‌డుతామ‌ని హామీ ఇవ్వడంతో డీజీపీ అనుమతి ఇచ్చినట్లు సమాచారం.



Next Story