- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఉపాధి పనులు చేస్తుండగా దొరికిన వెండి నాణాలు.. ఎక్కడంటే?
by Disha Web Desk 4 |
X
దిశ, మానకొండూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం గొల్లపల్లి గ్రామంలో శుక్రవారం ఉపాధి హామీ పనిచేస్తుండగా కూలీలకు మట్టితో చేసిన గురిగిలో వెండి నాణాలు లభ్యమయ్యాయి. గుట్టుచప్పుడు కాకుండా గురిగిని పగలగొట్టి నానాలను కూలీలు పంచుకున్నట్లు తెలిసింది. అయితే ఆ నోట.. ఈ నోట వ్యాపించడంతో అధికారులు రంగంలోకి దిగారు. గురిగిలో మొత్తం సుమారు (27)వెండి నాణేలు దొరికినట్టు గ్రామస్తులు తెలిపారు.
ఆలస్యంగా అధికారులకు విషయం తెలియడంతో శనివారం ఘటనా స్థలానికి వచ్చిన తహసీల్దార్ విచారణ చేసి కూలీల వద్ద నుండి 27 నాణేలు స్వాధీనం చేసుకున్నారు. దొరికిన వెండి నాణేలు మహబూబ్ అలీ నవాబ్ ఖాన్ కాలంలో (1869,1911)మధ్య చలామణిలో ఉన్నట్లు పురావస్తు శాఖ గుర్తించినట్లు తెలిపారు. ఘటనా స్థలానికి పోలీసులు వెళ్లి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Next Story