త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ: మాజీ మంత్రి జానారెడ్డి

by Disha Web Desk 19 |
త్వరలోనే రూ.2 లక్షల రైతు రుణమాఫీ: మాజీ మంత్రి జానారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ హామీపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి జానారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం కోదాడలో కాంగ్రెస్ నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణలో బీఆర్ఎస్ పని అయిపోయిందని అన్నారు. ఇచ్చిన హామీలు నేరవేర్చలేదు కాబట్టే బీఆర్ఎస్‌ను అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు చిత్తుగా ఓడించారన్నారు. రుణమాఫీ చేస్తామని గత బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులను మోసం చేసిందని ఫైర్ అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా త్వరలోనే మేం రూ.2 లక్షల రుణమాఫీ చేస్తామని ప్రకటించారు. పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో మెజార్టీ స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తుందని అన్నారు. కాగా, జానారెడ్డి కుమారుడు రఘువీర్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే కొడుకు గెలుపు కోసం రంగంలోకి దిగిన జానారెడ్డి.. నల్లగొండ పార్లమెంట్ పరిధిలో ప్రచారం నిర్వహిస్తున్నారు.

Next Story

Most Viewed