చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
చేవెళ్ల గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురేస్తాం : రంజిత్ రెడ్డి
X

దిశ, శేరిలింగంపల్లి : రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్లలో రెండోసారి ఎంపీగా గెలిచి కాంగ్రెస్ జెండా ఎగురవేస్తామని ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శేరిలింగంపల్లి నియోజకవర్గ పరిధిలోని కొండాపూర్ ప్రేమ్ నగర్, మాదాపూర్ డివిజన్ పరిధిలోని ఆదిత్య నగర్ బస్తీలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్ సభకు హాజరైన రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..మే 13వ తేదీన ప్రతిఒక్కరూ తమ బాధ్యతగా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని ప్రజలను కోరారు. చేవెళ్ల నుంచి అత్యధిక మెజార్టీతో తనను గెలిపించి పార్లమెంట్ కు పంపించాలని ప్రజలను కోరారు.

రేవంత్ రెడ్డి నాయకత్వంలో అభివృద్ధిలో భాగమవ్వడానికి, తాను ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ల ప్రాంతపు సమస్యల పై పూర్తి అవగాహన ఉన్న వ్యక్తిగా, వాటికి పరిష్కారం చూపగలిగే మీ నాయకుడిగా మీకు తోడుగా ఉంటానని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి మద్దతు పలకాలని ప్రజలను కోరారు. ఈ కార్యక్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి వి.జగదీశ్వర్ గౌడ్, ఎంబీసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ జెరిపేటి జైపాల్, శేరిలింగంపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, డివిజన్ ఇన్చార్జులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, ఎన్ ఎస్ యుఐ నాయకులు, సేవాదళ్ నాయకులు, మహిళలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed