జోరుగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం

by Disha Web Desk 11 |
జోరుగా నడుస్తున్న కాంగ్రెస్ పార్టీ ఇంటింటి ప్రచారం
X

దిశ,షాబాద్ : షాబాద్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు అందుకుంది. చేవెళ్ల గడ్డమీద కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేసే దిశగా కాంగ్రెస్ నేతలు ఇంటింటి ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సతీమణి సీతా ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అమలు చేసిన హామీలు వివరిస్తూ…కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషిగా నేతలందరూ కలిసి కట్టుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు పెంట రెడ్డి, సురేందర్ రెడ్డి, ఎంపీటీసీలు కుమ్మరి చెన్నయ్య, గుండాల అశోక్, దండు రాహుల్, అంతరం సర్పంచ్ చెన్నయ్య, కాంగ్రెస్ పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు పల్లాటి అశ్విని, తొంట వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed