- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
దేశంలో ప్రప్రథమంగా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీ.. పల్స్ హార్ట్ హాస్పిటల్ వైద్యుల ఘనత
దిశ, శేరిలింగంపల్లి: దేశంలోనే ప్రప్రథమంగా ఓపెన్ హార్ట్ సర్జరీ అవసరం లేకుండా మినిమల్లీ ఇన్వాసివ్ సర్జరీతో కార్సినోయిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్న 59 ఏళ్ల మహిళా రోగికి ట్రాన్స్కాథెటర్ పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్, ట్రైకస్పిడ్ వాల్వ్ రీప్లేస్మెంట్ చేసి పేషెంట్కు పునర్జీవం కల్పించారు మియాపూర్, పల్స్ హార్ట్ ఆస్పత్రి వైద్యులు. డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, డాక్టర్ మొవ్వా శ్రీనివాస్ నేతృత్వంలోని సర్జన్ల బృందం కార్సినోయిడ్ గుండె జబ్బుతో బాధపడుతున్న రోగికి కుడివైపు గుండె కవాటాలు ట్రైకస్పిడ్, పల్మనరీ వాల్వ్లు రెండూ తీవ్రంగా లీకేజికీ గురయ్యాయని గుర్తించారు.
దీంతో శస్త్ర చికిత్స లేకుండా రోగికి ట్రాన్స్కాథెటర్ పల్మనరీ వాల్వ్ రీప్లేస్మెంట్, ట్రైకస్పిడ్ వాల్వ్ రీప్లేస్మెంట్ను నిర్వహించారు. టీవీపీఆర్ అనేది భారతదేశంలోని ఎంపిక చేయబడిన కొన్ని వైద్య కేంద్రాలలో మాత్రమే చేయడానికి అవకాశం ఉన్నా.. చాలా అరుదైన ప్రక్రియ. అయితే టీఆర్ ఐసీ వాల్వ్ భర్తీ కొరకు ప్రత్యేక శిక్షణ, నైపుణ్యం అవసరమయ్యే మరింత అరుదైన చికిత్స. ఈ రెండు విధానాలను ఒకే రోగిలో నిర్వహించడం అనేది ఒక ప్రత్యేకమైందని వైద్యులు వెల్లడించారు. ప్రపంచ వ్యాప్తంగా నాలుగు చోట్ల ఇలాంటి చికిత్స నిర్వహించగా దేశంలో మియాపూర్ పల్స్ హార్ట్ ఆస్పత్రిలో నిర్వహించడం విశేషం.
ఈ వైద్య చికిత్సకు డాక్టర్ వినోద్ ఉన్ని, డాక్టర్ క్రాంతి కుమార్, డాక్టర్ వికాస్ శుక్లా, డాక్టర్ వంశీ, డాక్టర్ నంద కిషోర్, డాక్టర్ చంద్రేష్, డాక్టర్ రాజేష్, బెంగళూరుకు చెందిన కార్డియాలజిస్టులు డాక్టర్ జయ రంగనాథ్, డాక్టర్ శ్రీనివాస్, అహ్మదాబాద్కు చెందిన డాక్టర్ అభిషేక్ రాజ్పోపట్ మార్గదర్శకులుగా వ్యవహరించారు. ప్రస్తుతం రోగి కోలుకుని చికిత్స తర్వాత నడుస్తుందని వైద్యులు తెలిపారు. ఆమె పరిస్థితిని క్రిటికల్ కేర్ నిపుణులు, కార్డియాలజిస్టులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు. గుండె జబ్బులు కోసం పల్స్ హార్ట్ ఆస్పత్రిలో నిపుణులైన వైద్యులు ఉన్నారని, ఎప్పుడూ అందుబాటులో ఉంటారని ఆస్పత్రి యాజమాన్యం తెలిపింది.