- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల ప్రాంతంపై ఎనలేని అభిమానం : కొండా సంగీతారెడ్డి
దిశ ప్రతినిధి, వికారాబాద్ : భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని కొండా సంగీతారెడ్డి అన్నారు. సోమవారం వికారాబాద్ పట్టణంలోని రాజీవ్ గృహకల్ప, రామయ్యగూడ, ఎంఐజీ ప్రాంతాల్లో నిర్వహించిన ముగ్గుల కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా సంగీతా రెడ్డి మాట్లాడుతూ భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలను కాపాడడంలో మహిళల పాత్ర అమూల్యమైనదని అన్నారు. భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచదేశాలకు చాటి చెప్పారని ఆమె తెలిపారు. భారతదేశాన్ని ప్రపంచదేశాలకు ఆదర్శంగా నిలుపుతున్న నరేంద్రమోదీని మరోసారి ప్రధాని చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని కొండా సంగీతారెడ్డి చెప్పారు.
ప్రపంచంలోని అగ్రరాజ్యాల అధినేతలు కూడా ఇవాళ నరేంద్ర మోదీని విశ్వగురుగా కీర్తిస్తున్నారని ఆమె అన్నారు. దేశాన్ని అభివృద్ధిపథంలో నడిపిచడానికి నరేంద్రమోదీని, చేవెళ్లను ప్రగతి మార్గంలో పయనించజేయడానికి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని గెలిపించాలని కొండా సంగీతారెడ్డి కోరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి చేవెళ్ల ప్రాంతంపై ఎనలేని అభిమానమని, అందుకే ఆయన నిత్యం ప్రజా సేవలోనే ఉంటారని ఆమె చెప్పారు. మే 13న జరగనున్న పోలింగ్ లో మహిళంతా పెద్ద సంఖ్యలో పాల్గొని కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి కొండా విశ్వేశ్వర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట బీజేపీ జిల్లా అధ్యక్షుడు మాధవరెడ్డి, పలువురు మహిళా మోర్చా నాయకురాళ్లు, కార్యకర్తలు ఉన్నారు.