కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : రంజిత్ రెడ్డి

by Disha Web Desk 23 |
కాంగ్రెస్‌తోనే అన్ని వర్గాలకు న్యాయం : రంజిత్ రెడ్డి
X

దిశ,తాండూరు : మనిషి నడవడిక ఎలా ఉండాలో, ఎలా బతకాలో మార్గదర్శం చేసిన రాముడు ఆదర్శ పురుషుడయ్యాడని చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు.యాలాల మండలంలోని జుంటుపల్లి సీతారామచంద్ర స్వామి దేవాలయంలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా బుధవారం సీతారాముల కళ్యాణ మహోత్సవ వేడుకలు నిర్వహించారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి,చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి తో కలిసి సీతారాముల కళ్యాణం ఉత్సవానికి పట్టు వస్త్రాలు ముత్యాల తలంబ్రాలను రాముల వారి కళ్యాణ మండపంలో అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా రంజిత్ రెడ్డి మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీతోనే అన్ని వర్గాలకు సమన్యాయం జరుగుతుందన్నారు.

దేశ ప్రజల చూపు కాంగ్రెస్ వైపు ఉందని దేశాన్ని మోదీ ప్రభుత్వం లూటీ చేసి, భ్రష్టు పట్టించిందని ఆయన ఆరోపించారు.కేంద్రం, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడితేనే అన్ని వర్గాలు అభివృద్ధి చెందుతాయన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ప్రజలు ఆదరిస్తున్నారని ఆయన అన్నారు‌. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారంటీలను ఇంటింటికి తీసుకెళ్లడం అందరి బాధ్యతగా భావించాలన్నారు.ఈ కార్యక్రమంలో యాలాల పిఏసిఎస్ చైర్మన్ సురేందర్ రెడ్డి, హన్మంత్ ముదిరాజ్, కరణం పురుషోత్తం రావు ప్రభాకర్ గౌడ్,కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉన్నారు. అనంతరం అన్నదాన కార్యక్రమంలో రంజిత్ రెడ్డి, మనోహర్ రెడ్డిలు పాల్గొన్నారు .

Next Story

Most Viewed