చేవెళ్ల ప్రజలకు నేను గ్యారంటీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి

by Disha Web Desk 11 |
చేవెళ్ల ప్రజలకు నేను గ్యారంటీ : కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి
X

దిశ, శంషాబాద్ : చేవెళ్ల ప్రజలకు నేను గ్యారంటీ అని చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి అన్నారు. శంషాబాద్ మాజీ ఎంపీపీ చెక్కల ఎల్లయ్య మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో.. మంగళవారం రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ లోని ఎస్వీ రెడ్డి గార్డెన్లో నిర్వహించిన మహిళా సదస్సుకు ముఖ్య అతిథిగా చేవెళ్ల కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డి ఆయన సతీమణి సీతా రంజిత్ రెడ్డి హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ… ఎవరైనా తనపై అసత్య ఆరోపణలు చేస్తే ఆధారాలతో సహా నిరూపించాలన్నారు. ఆధారాలు తీసుకుని వస్తే ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నేను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్నాను అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంటేనే సంక్షేమానికి పెద్దపీట వేసే ప్రభుత్వమన్నారు. 3 నెలలు కాకముందే ఐదు గ్యారంటీలు అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కింది అన్నారు. ఈ ఆరు గ్యారెంటీ పథకాల్లో కూడా మహిళలకే పెద్ద పీట వేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఉచితంగా మహిళలకు బస్సు సౌకర్యం కల్పించడం జరిగింది అన్నారు.

మహిళలకు 500 కే గ్యాస్ కలెక్షన్, నెలకు 2,500 రూపాయల నగదు బదిలీ తోపాటు ఇందిరమ్మ ఇండ్లు, 200 యూనిట్ల వరకు ఉచిత కరెంటును అందించడం జరిగిందన్నారు. గతంలో ఎంపీగా గెలిచి ఇప్పుడు బీజేపీ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడిన విశ్వేశ్వర్ రెడ్డిని కలవాలంటే ప్రజలు అపాయింట్మెంట్ తీసుకోవాలని అన్నారు. తనను కలవాలి అంటే 24 గంటలపాటు ఇంటి తలుపులు తెరిచే ఉంటాయన్నారు. ప్రజలందరూ కాంగ్రెస్ పార్టీ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాజేంద్రనగర్ నియోజకవర్గం ఇన్చార్జి కస్తూరి నరేందర్ ముదిరాజ్, మాజీ సర్పంచులు చెక్కల చంద్రశేఖర్, లక్ష్మయ్య, హస్లీ రాములు,ఎంపిటిసి సంగీత సిద్దేశ్వర్, మండల పార్టీ ఉపాధ్యక్షులు కోటేశ్వర్ గౌడ్, జీవన్ గౌడ్, ప్రధాన కార్యదర్శి మహేందర్ ముదిరాజ్, యాదగిరి రెడ్డి, సులోచన, సప్తగిరి గౌడ్,బొబ్బిలి శేఖర్,రఫీక్, ప్రభాకర్ యాదవ్, వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed