- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి ఎంపీ రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలి
దిశ, మోమిన్ పేట్ : వచ్చే ఎన్నికల్లో చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని తెలంగాణ సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్ అన్నారు. మంగళవారం వికారాబాద్ జిల్లా మర్పల్లి మండల్ కేంద్రంలో ఎంసీఎం ఫంక్షన్ హాల్ లో ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలు అమలు చేయడానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముందుకు వెళ్తున్నారని తెలిపారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో చేయి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి రంజిత్ రెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని అన్నారు.
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థి అయిన రంజిత్ రెడ్డి మాట్లాడుతూ… వచ్చే ఎన్నికల్లో తనను కాంగ్రెస్ పార్టీ బిడ్డగా దీవించి చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ఆయన కోరారు. ఎప్పుడైనా ఎవరికైనా అవసరం ఉంటే ఫోన్ చేయండి తప్పకుండా స్పందించి ప్రజలకు పనులు చేస్తానని ఆయన అన్నారు. మే నెల 13వ తేదీ నాడు జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో చేతి గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని సభాముఖంగా కోరారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి అక్కడక్కడ మాట్లాడుతూ తాను అంగన్వాడీలకు గుడ్లు అమ్ముకున్నానని అంటున్నాడు. అది వాస్తవం కాదని, నేను కష్టపడి వ్యాపారాలు చేస్తూ పైకి వచ్చిన వాడినని అన్నారు. నాపై చేసే ఆరోపణలు మానుకొని రుజువులు చూపించాలని ఒకవేళ నా తప్పులు ఉంటే నేను ఎంపీ ఎన్నికల నుంచి తప్పుకుంటానని అన్నారు.