ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు

by Disha Web Desk 23 |
ఎమ్మెల్సీ విజయోత్సవ సంబరాలు జరుపుకున్న బీజేపీ శ్రేణులు
X

దిశ, చేవెళ్ల: చేవెళ్ల మండల కేంద్రంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి విజయం సాధించిన సందర్భంగా చేవెళ్ల బీజేపీ నాయకులు బాణాసంచా పేల్చి సంబరాలు చేసుకున్నారు.ఈ సందర్భంగా మండల ప్రధాన కార్యదర్శి అత్తెల్లి అనంతరెడ్డి మాట్లాడుతూ.. ఏవిఎన్ రెడ్డిని గెలిపించిన ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. టీచర్ల సమస్యల పరిష్కారానికి మేం మరింత ఉధృతంగా పోరాడేందుకు ఈ విజయం ప్రేరణనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఓబీసీ చీర శ్రీనివాస్, అల్లవాడ శ్రీనివాస్ రెడ్డి, అశోక్, బండారి శేఖర్ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, కుంచం శ్రీనివాస్, శేరిలింగం, మధుసూదన్ రెడ్డి, హరిలాల్, ఉబ్బటి సత్యం, ప్రశాంత్, దామోదర్ చారి, రఘు, హనుమంత్, తదితరులు పాల్గొన్నారు.

Next Story

Most Viewed