బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదు, బీజేపీకి ఆదరణ లేదు : చామల డింపుల్

by Disha Web Desk 23 |
బీఆర్ఎస్‌కు భవిష్యత్తు లేదు, బీజేపీకి ఆదరణ లేదు :  చామల డింపుల్
X

దిశ,యాచారం : 6 గ్యారంటీ పథకాలతో తెలంగాణ ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందని చామల కిరణ్ కుమార్ రెడ్డి సతీమణి డింపుల్ అన్నారు. బుధవారం మండలంలోని నందివనపర్తి, అయ్యవారిగూడెం, గ్రామాల్లో స్నేహ రెడ్డి తో కలిసి చెయ్యి గుర్తుకు ఓటు వేయాలని కరపత్రాలను పంచుతూ ఇంటింటి ప్రచారం చేశారు. రోడ్ షోలో మాట్లాడుతూ.. పేద ప్రజలకు కాంగ్రెస్ పార్టీతోనే న్యాయం జరుగుతుందని మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, చేసిన అభివృద్ధి ఏమీ లేదని విమర్శించారు. ధరణి, కాళేశ్వరం తో ప్రజల సొమ్మును దోచుకుంటుంటే నరేంద్ర మోడీ కేసీఆర్ ను ఏమీ చేయలేదని, ఇద్దరు ఒక్కటేనని పేదలకు చేసింది ఏమీ లేదని ఆరోపించారు. లక్ష మెజారిటీతో చామల కిరణ్ కుమార్ రెడ్డి ని గెలిపించాలని ఓటర్లను కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ రాచర్ల వెంకటేశ్వర్లు, బియన్ రెడ్డి ట్రస్ట్ చైర్మన్ బిలకంటి శేఖర్ రెడ్డి, బట్టు శ్రీనివాస్, వరికుప్పల తిరుమలేష్ శివ చారి పాల్గొన్నారు.

Next Story

Most Viewed