ఎన్నికల వేళ CM రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు బంపర్ ఆఫర్

by Disha Web Desk 19 |
ఎన్నికల వేళ CM రేవంత్ రెడ్డికి రఘునందన్ రావు బంపర్ ఆఫర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఎన్నికల వేళ సీఎం రేవంత్ రెడ్డికి మెదక్ బీజేపీ పార్లమెంట్ అభ్యర్థి రఘునందన్ రావు బంపర్ ఆఫర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డికి 48 గంటల టైమ్ ఇస్తున్నానని.. తనకు గడీ ఉందని నిరూపిస్తే ఆ గడీ ఆయన పేరు మీదే రిజిస్ట్రేషన్ చేయిస్తానని పేర్కొన్నారు. రిజిస్ట్రేషన్ ఖర్చులు కూడా తానే భరిస్తానని ఆఫర్ ఇచ్చారు. అలాగే మెదక్‌కు బీజేపీ ఏం చేసిందో బుక్ తయారు చేశానని.. ఆ పుస్తకాన్ని సీఎం రేవంత్ రెడ్డికి కొరియర్ చేస్తున్నానని చెప్పారు. మాజీ సీఎం కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి ఇంకా ఎక్కువ అబద్ధాలు చెబుతున్నారని ఫైర్ అయ్యారు.

రేవంత్ రెడ్డి మాట ఇచ్చినట్లుగా ఆగస్ట్ 15 నాటికి రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ పూర్తి కాదని కీలక వ్యాఖ్యలు చేశారు. కాగా, ఇటీవల మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న రేవంత్.. బీజేపీ, రఘునందర్ రావుపై విమర్శల వర్షం కురిపించారు. మెదక్‌కు బీజేపీ ఏం చేయలేదన్న సీఎం.. రఘునందన్ రావుకు గడీలు ఉన్నాయని.. కాంగ్రెస్ అభ్యర్థి సామాన్యుడని అన్నారు. ఈ క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు రియాక్ట్ అయిన రఘునందన్ రావు తనకు గడీ ఎక్కడ ఉందో నిరూపించాలని సవాల్ విసిరారు. నిరూపిస్తే గడీ రేవంత్ రెడ్డికే రాసిస్తానని ఆఫర్ ఇచ్చారు.



Next Story

Most Viewed