- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
పెళ్లి వాహనం బోల్తా....12 మందికి గాయాలు
దిశ, లింగంపేట్ : వివాహ వేడుకకు హాజరయ్యేందుకు ఫంక్షన్ హాల్ కు వస్తుండగా వాహనం అదుపు తప్పి బోల్తా పడడంతో 12 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని లింగంపల్లి గ్రామానికి చెందిన కొత్త కిషన్ కుమారుడి వివాహానికి వచ్చిన బంధువులను లింగంపల్లి గ్రామం నుండి జీఎన్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ కు వస్తుండగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. గూడ్స్ వాహనంలో బంధువులను తీసుకొని వస్తుండగా అదుపుతప్పి వాహనం బోల్తా పడింది. వాహనంలో సామర్థ్యానికి మించి ఎక్కువ మంది ఎక్కడం వల్ల ప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది. ఈ ప్రమాదంలో కొత్త సావిత్రి,
ఆదిత్య, వర్ష, కిషన్, కొత్త రాములు, లక్ష్మి, సత్యవతి, ఆడ్లూరు ఎల్లారెడ్డి గ్రామానికి చెందిన రాజేశ్వర్, రెడ్డిపేట గ్రామానికి చెందిన లక్ష్మీ, గాంధారికి చెందిన అంజయ్య, ఊరంచ రాములు గాయపడ్డారు. ప్రమాదంలో గాయపడిన వారిని చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్ వాహనంలో కామారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదం విషయం తెలుసుకున్న ఎస్ఐ చైతన్య కుమార్ రెడ్డి సిబ్బందితో వెళ్లి క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి ప్రధాన రహదారిపై ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఎస్సై చర్యలు తీసుకున్నారు. పెళ్లికి వస్తున్న వాహనం బోల్తాపడి బంధువులకు, కుటుంబ సభ్యులకు గాయాలు కావడంతో పెళ్లి పందిరిలో విషాదచ్ఛాయలు అలుముకున్నాయి.