సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి

by Disha Web Desk 15 |
సీఎం కేసీఆర్ బహిరంగ సభకు వేలాదిగా తరలిరండి
X

దిశ, ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లోని వేల్పూర్ మండల కేంద్రంలో గల స్పైసెస్ పార్క్ మైదాన ఆవరణలో గురువారం జరగనున్న సీఎం కేసీఆర్ బహిరంగకు బాల్కొండ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు వేలాదిగా తరలిరావాలని రాష్ట్ర రోడ్లు భవనాల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కోరారు. బుధవారం బాల్కొండ నియోజకవర్గం వేల్పూర్ స్పైస్ పార్క్ గ్రౌండ్ లో జరగనున్న సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాదసభ ఏర్పాట్లను రాష్ట్ర మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, పరిశ్రమల కార్పొరేషన్ చైర్మన్ గ్యాదరి బాల మల్లు తో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతగా నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభను విజయవంతం చేయాలని కోరారు. సీఎం కేసీఆర్ సభకు హాజరయ్యే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయించాలని మంత్రి సూచించారు. వీరి వెంట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఉన్నారు.

Next Story

Most Viewed