హైవేపై లారీ బోల్తా...

by Disha Web Desk 11 |
హైవేపై లారీ బోల్తా...
X

దిశ భిక్కనూరు : హై వేపై వెళ్తున్న లారీ అదుపుతప్పి డివైడర్ ఎక్కి బోల్తా పడిన సంఘటన భిక్కనూరు మండలం సిద్ధ రామేశ్వర నగర్ సమీపంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. లప్పం పెయింట్ కు సంబంధించి ముడిసరుకు లోడుతో భిక్కనూరు నుంచి హైదరాబాద్ వైపు వెళ్తున్న లారీ, గ్రామానికి వెళ్లే మలుపు వద్ద అకస్మాత్తుగా డివైడర్ ఎక్కి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ లకు ఎలాంటి గాయాలు కాలేదు. ఆ వాహనం వెనకాల ఉన్న వాహనం సడన్ బ్రేక్ వేయడంతో ఒకదాని వెనకాల వస్తున్న మరో వాహనాలు ఢీకొన్నాయి. దీంతో రహదారిపై వన్ సైడ్ ట్రాఫిక్ జామ్ కావడం అయింది. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటన స్థలానికి చేరుకోవడం, అదే సమయంలో జిఎంఆర్ సిబ్బంది క్రేన్ ను తెప్పించి లారీని పక్కకు తగ్గించడంతో ట్రాఫిక్ క్లియర్ అయ్యింది.



Next Story

Most Viewed