మానవత్వం చాటుకున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్

by Sumithra |
మానవత్వం చాటుకున్న ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : డిచ్ పల్లి మండలం లింగసముద్రం గ్రామానికి చెందిన కొట్టాడి చిన్నయ్య, ఆయన భార్య, కూతురు రోడ్డు ప్రమాదం గురయ్యారు. పండగవేల సోమవారం జాతీయ రహదారి ధర్మారం శివారులో రోడ్డు పై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ లింగసముద్రం గ్రామానికి చెందిన కొట్టాడి చిన్నయ్య, ఆయన భార్య, కూతురు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. కాగా క్షతగాత్రులను ఆర్టీసీ చైర్మన్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ హుటాహుటిన 108 అంబులెన్స్ కు ఫోన్ చేసి ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు. అనంతరం డాక్టర్లకు ఫోన్ చేసి బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు ఆదేశించారు.

Advertisement

Next Story