కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రచ్చ

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో రచ్చ
X

దిశ, నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో శుక్రవారం సాయంత్రం ఏర్పాటు చేసిన నిజామాబాద్ పార్లమెంటరీ సన్నాహక సమావేశం కొత్త రచ్చకు దారితీసింది. ఏళ్ల తరబడి పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ జెండా మోసి పార్టీని బలోపేతం చేసే దిశగా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే విధంగా కృషి చేసిన కార్యకర్తలను, కాంగ్రెస్ సీనియర్ నాయకులను జిల్లాకు

చెందిన కొందరు ముఖ్య కాంగ్రెస్ పార్టీ నాయకులు పట్టించుకోవడంలేదని ప్రభుత్వ సలహాదారుడు షబీర్ అలీ ముందు మైనార్టీ సీనియర్ నాయకులు జావిద్ అక్రమ్ ఆవేదన వ్యక్తం చేశారు. నిన్నగాక మొన్న కాంగ్రెస్ పార్టీలోకి వలస వచ్చిన కొందరు బీఆర్ఎస్ నాయకులకు అధిక ప్రాధాన్యమిస్తూ వారిని వేదికపై ముందు వరుసలో కూర్చోబెట్టడం ఎంతవరకు సమంజసం వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పార్టీ కోసం ఏళ్లుగా పనిచేసిన వారిని గుర్తించి తగిన ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన షబ్బీర్ అలీని కోరారు.

Next Story

Most Viewed