- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
అవినీతి రహిత పాలన అందిస్తా
దిశ, భిక్కనూరు : మున్సిపాలిటీలో అవినీతి రహిత పాలన అందిస్తానని కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గడ్డం ఇందుప్రియ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. మున్సిపల్ చైర్ పర్సన్ గా గెలుపొందిన ఆమె మంగళవారం సాయంత్రం భిక్కనూరులో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశానికి ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీ, మున్సిపల్ కౌన్సిలర్లతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా షబ్బీర్ అలీ మాట్లాడుతూ ఇక్కడి నుంచి వచ్చి కామారెడ్డిలో కొత్తగా ఇండ్లు కట్టుకునే వారికి డబ్బులు తీసుకోకుండా పర్మిషన్ ఇవ్వాలని సూచించగా,
అలాగే చేస్తా అన్న అంటూ ఇందుప్రియ సమాధానం ఇచ్చారు. అనంతరం ఆమె మాట్లాడుతూ జరగబోయే పార్లమెంటు ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ ను భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. కామారెడ్డి మున్సిపల్ చైర్ పర్సన్ గా అవకాశం కల్పించినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబ్బీర్ అలీకి, తనకు పూర్తి సహకారం అందించిన కౌన్సిలర్లకు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఇందుప్రియ దంపతులను శాలువా కప్పి సత్కరించారు.