ఇంటింటికీ బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అరవింద్

by Disha Web Desk 12 |
ఇంటింటికీ బీజేపీ ప్రచారంలో పాల్గొన్న ఎంపీ అరవింద్
X

దిశ, నిజామాబాద్ సిటీ: నిజామాబాద్ నగరంలోని 35వ డివిజన్ పరిధిలో గల హమాల్ వాడి ప్రాంతంలోని ఇంటింటి ప్రచారంలో భాగంగా విఠలేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రచారాన్ని ప్రారంభించారు. రాష్ట్ర ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మోడీ ప్రభంజనం కొనసాగుతుందని అన్నారు. ఎక్కడ చూసినా ప్రజలు సుస్థిర పాలన కావాలని ప్రజలు ఎదురుచూస్తున్నారని, అదే విధంగా దేశంలో రామరాజ్యం రావాలని కోరుకుంటున్నారని అన్నారు.

త్వరలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూలబోతుంది

ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన ఆయన ఆగస్టు తర్వాత రేవంత్ రెడ్డి రైతులకు రైతుబంధు అందిస్తానని ప్రకటించడం హాస్యాస్పదమన్నారు. అప్పటివరకు ఈ ప్రభుత్వం ఎప్పుడు ఉంటుందా ఊడుతుందా తెలియని కాంగ్రెస్ నేతలకు ముఖ్యమంత్రి కి ఆగస్టు తర్వాత రైతుబంధు ఇస్తామని అనడం సిగ్గుచేటు అన్నారు.


Next Story