ఎమ్మెల్యే పోచారం ఊరుకో...ఈ వయసులో అబద్దాలా ..: మాజీ ఎమ్మెల్యే

by Disha Web Desk 11 |
ఎమ్మెల్యే పోచారం ఊరుకో...ఈ వయసులో అబద్దాలా ..: మాజీ ఎమ్మెల్యే
X

దిశ, బాన్సువాడ : ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ వయసులో కూడా అబద్దాలు మాట్లాడుతున్నారని, దాన్ని మానుకోవాలని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జి ఏనుగు రవీందర్ రెడ్డి విమర్శించారు. నిజామాబాద్ జిల్లా వర్ని మండల కేంద్రంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… పోచారం శ్రీనివాస్ రెడ్డి శనివారం విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ... డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల బిల్లులను ప్రభుత్వం చెల్లించకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడ్డానని చెప్పడం విడ్డూరం అన్నారు.

ఈ వయసులో పోచారం ఇలాంటి అబద్ధాలు మాట్లాడడం సమంజసం కాదని, గత ప్రభుత్వంలో మీ అనుచరులు ఆ బిల్లులను కాంట్రాక్టర్ల ద్వారా విడుదల చేయించుకొని గత ఎన్నికల్లో వాడుకోవడం జరిగిందని అన్నారు. ఈ విషయంలో మీకు నిజాయితీ ఉంటే బిల్లులను లబ్ధిదారులకు మీ అనుచరులైన కాంట్రాక్టర్ల దగ్గర నుండి ఇప్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో నాపై చేసిన ఆరోపణలను విరమించుకొని లబ్ధిదారులకు క్షమాపణ చెప్పాలని చెప్పారు.

మీరు ఇలాంటి మొసలి కన్నీళ్లు ఎన్ని కార్చినా నియోజకవర్గం ప్రజలు ఇక మిమ్మల్ని నమ్మే పరిస్థితి లేదని, ఇలాంటి అబద్ధాలు ఆడకుండా ఆ బిల్లులను ఇప్పించి లబ్ధిదారులకు మేలు చేయాలని కోరుతున్నానని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంపీటీసీల ఫోరం మాజీ అధ్యక్షుడు ఎలమంచిలి శ్రీనివాసరావు, ఎంపీపీ లక్ష్మీ మేక వీర్రాజు, మాజీ ఎంపీపీ బద్యా నాయక్, టౌన్ అధ్యక్షుడు మొయిన్, డిసిసి డెలికేట్ రాజారెడ్డి, నాయకులు గంగా ప్రసాద్, అడ్వకేట్ బానోత్ రమేష్, సొసైటీ డైరెక్టర్ గంగప్ప, రెడ్డి రాంబాబు, కోనేరు సురేష్, కంది శ్యామ్, మాజీ ఎంపీటీసీ హరి మరియు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.



Next Story

Most Viewed