- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రాముడిని పూజిద్దాం.. బీజేపీని తొక్కుదాం : మన్నె శ్రీనివాస్ రెడ్డి
దిశ, జడ్చర్ల : కేంద్రంలో బిజెపి పదేళ్లు అధికారంలో ఉండి అభివృద్ధి పనులు చేయకపోగా రామున్ని తమ స్వార్థ రాజకీయాల కోసం వాడుకుంటున్నారని అలాంటి వారికి రాముని మొక్కుదాం బిజెపిని తొక్కుదాం అనే నినాదంతో ముందుకు వెళ్దామని మహబూబ్నగర్ పార్లమెంట్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి పిలుపునిచ్చారు. ఇచ్చిన హామీలను వందరోజుల అమలు చేస్తామని అధికారంలోకి వచ్చి హామీలను విస్మరించిన కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎన్నికల్లో తమ ఓటుతో తగిన బుద్ధి చెబుదాం, బీఆర్ఎస్ పార్టీని అఖండ మెజార్టీతో గెలిపిద్దాం అని అన్నారు. సోమవారం జడ్చర్ల మండల పట్టణ బిఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశానికి మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అధ్యక్షతన పట్టణంలోని చంద్రకార్డెన్ లో నిర్వహించారు.
ఈ సందర్భంగా మహబూబ్నగర్ఎంపీ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… అధికారంలో లేమని కార్యకర్తలు ఎవరు అధైర్య పడద్దని, నేను ఎవరికి తలవంచనని, ఎన్నికల్లో మంచి మెజార్టీతో గెలిపించండి అన్ని విధాలుగా అండగా ఉంటానని కార్యకర్తలకు భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కోడగల్ యాదయ్య, మున్సిపల్ చైర్ పర్సన్ దోరేపల్లి లక్ష్మి, పి ఎస్ సి ఎస్ చైర్మన్ పాలెం సుదర్శన్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ గోవర్ధన్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కాట్రేపల్లి లక్ష్మయ్య, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పర్వత రెడ్డి, నాగిరెడ్డి శంకర్ నాయక్, రామ్మోహన్ మైనార్టీ నాయకులు, ఆఫీజ్ ఉర్ రెహమాన్, మాజీ సర్పంచులు మూడా డైరెక్టర్లు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.