యూపీఎస్సీ ఫలితాల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లావాసి

by Disha Web Desk 15 |
యూపీఎస్సీ  ఫలితాల్లో సత్తా చాటిన కామారెడ్డి జిల్లావాసి
X

దిశ, తాడ్వాయి : యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ ఫలితాలు విడుదల అయ్యాయి. సివిల్స్ పరీక్ష ఎంతో కఠినంగా కూడింది. ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వూలల్లో ఎదురయ్యే కఠిన సవాళ్లను ఎదుర్కొని నిలబడడం ఆశామాషీ విషయం కాదు. అలాంటిది జాతీయస్థాయిలో 587 ర్యాంక్ సాధించి భలా అనిపించాడు రజినీకాంత్. కామారెడ్డి జిల్లా రాజంపేట్ మండలం ఆర్గోండ గ్రామానికి చెందిన రామిరెడ్డిపేట సిద్ధ రాములు, పద్మ దంపతుల రెండవ కుమారుడు రామిరెడ్డిపేట రజినీకాంత్ జాతీయస్థాయిలో సత్తా చాటాడు. చిన్నప్పటి నుంచే సమాజ సేవ చేయాలనే కోరికతో సివిల్స్ ఎంచుకున్నట్లు తెలిపారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, శ్రేయోభిలాషులు కృతజ్ఞతలు తెలిపారు.


Next Story

Most Viewed