అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు చేపట్టాలి

by Disha Web Desk 15 |
అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతులు చేపట్టాలి
X

దిశ, తాడ్వాయి : అమ్మ ఆదర్శ పాఠశాలలో మౌలిక వసతుల ఏర్పాటుకు మంజూరైన పనులను జూన్ చివరిలోగా పూర్తి చెయ్యాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులకు ఆదేశించారు. శుక్రవారం రాజంపేట్ మండలంలోని ఆరెపల్లి ప్రాథమికోన్నత పాఠశాల, ఆరెపల్లి తండా పాఠశాలను ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ...

సాధ్యమైనంత తక్కువ ఖర్చుతో గ్రామాల సమైక్య ఆధ్వర్యంలో పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులకు సూచించారు. పాఠశాలలో తాగు నీరు, టాయిలెట్స్ వంటి మౌలిక వసతులను చేపట్టి పూర్తి చేయాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ డీఈ ఆనందం, ఎంఈఓ రామస్వామి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, గ్రామ సమాఖ్య అధ్యక్షురాలు లలిత, తదితరులు పాల్గొన్నారు.

Next Story