కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్

by Disha Web Desk 15 |
కాంగ్రెస్ గూటికి మాజీ ఎమ్మెల్సీ రాజేశ్వర్
X

దిశ ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లాకు చెందిన బీఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ డి. రాజేశ్వర్​ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మంగళవారం హైదరాబాద్​లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో రాజేశ్వర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ, నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన రాజేశ్వర్ కు సీఎం రేవంత్ రెడ్డి పార్టీ కండువా వేసి ఆహ్వానించారు. నిజామాబాద్ పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని కోరారు.

కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పుడే రాజేశ్వర్ బీఆర్ఎస్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. గతంలో ఒకసారి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మంగళవారం అధికారికంగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రాజేశ్వర్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ తనను గల్లీ కౌన్సిలర్ మొదలుకొని ఎమ్మెల్సీగా , రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ గా, ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశాలు ఇచ్చిందని, తనకు రాజకీయ జన్మనిచ్చిన కాంగ్రెస్ పార్టీ లోకి తిరిగి రావడం ఆనందాన్నిచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి, ఎంపీ అభ్యర్థి గెలుపు కోసం తనవంతు కృషి చేస్తానని తెలిపారు.


Next Story

Most Viewed