- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
ఔరేక్ బార్ మోడీ సర్కార్
దిశ, ఆలూర్ : భారత దేశంలో అబ్ కా బార్ చార్ సౌ పార్... ఔరేక్ బార్ మోడీ సర్కార్ అనే నినాదం నడుస్తోందని ఆలూరు మండల కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ యువత కోసం నరేంద్ర మోడీ ప్రపంచ స్థాయి విద్యాసంస్థలు ఐఐటీ, ఏఐఎంఎంఎస్ తీసుకొచ్చారని, ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా మధ్యతరగతి కుటుంబాలకు సొంతింటి కల నెరవేర్చుతున్నారన్నారు. కట్టెల పొయ్యితో పేద మహిళలు అనారోగ్య సమస్యల పాలు కాకుండా ప్రధానమంత్రి ఉజ్వల యువజన పథకం ద్వారా 20 కోట్ల కుటుంబాలకు ఉచిత వంట గ్యాస్ కనెక్షన్లు పంపిణీ చేశారన్నారు.
400 ఎంపీలతో నరేంద్ర మోడీని ప్రధానమంత్రిని చేస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థను మూడో స్థానానికి తీసుకెళ్తారన్నారు. సీతాదేవిని కించపరిచే పోస్టులు చేసే నీచపు రాజకీయం కాంగ్రెస్ ది అని అన్నారు. గ్రామాలు అభివృద్ధి చెందుతున్నాయి అంటే కారణం నరేంద్ర మోడీ నిధులే అన్నారు. ఈసారి ప్రతి ఒక్కళ్లు ఓటు వేసి నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచారని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ నియోజవర్గ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి, రాష్ట్ర నాయకులు, ఆలూరు మండల ఎన్నికల ఇంచార్జ్ విజయభారతి , కోటపాటి నరసింహ, ఆలూరు మండల అధ్యక్షుడు గిరీష్ , నాడీశరం మల్లయ్య, డాక్టర్ అరుణ్ , సుభాష్, సురేష్ గౌడ్, నవీన్, హరీష్, మనీష్, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.