గంజాయి మత్తులో కత్తితో దాడి...

by Disha Web Desk 11 |
గంజాయి మత్తులో కత్తితో దాడి...
X

దిశ, ప్రతినిధి, నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా కేంద్రంలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ప్రశాంతంగా ముగిసిందని పోలీసులు ఊపిరిపీల్చుకుంటుండగా కత్తి మరో సారి నెత్తురు చిమ్మింది. ఈ సంఘటన సోమవారం సాయంత్రం నగరంలోని అర్సపల్లి చౌరస్తాలోని పోలీసు ఔట్ పోస్ట్ వద్ద జరిగింది. గంజాయి మత్తులో యువకుడు మరో యువకుడిని కత్తితో పొడిచాడు. ఈ ఘటనలో గాయపడిన యువకుడికి గొంతు తెగి తీవ్ర రక్తస్రావమైంది. గాయపడిన యువకుడిని ఫిరోజ్ ఖాన్ గా గుర్తించగా పొడిచిన యువకుడిని అక్రమ్ ఖాన్ గా గుర్తించారు. పోలీస్ ఔట్ పోస్టు వద్ద పోలీసు సిబ్బంది ఉండగానే అక్రమ్ ఖాన్ కత్తితో ఫిరోజ్ ఖాన్ పై దాడి చేశారు. ఈ ఘటనకు పాతకక్షలు కారణమని సమాచారం. అక్కడ ఉన్న కానిస్టేబుల్ కలుగజేసుకుని ఫిరోజ్ ఖాన్ కు రక్షించారు. స్థానికులు ఫిరోజ్ ఖాన్ ను జిల్లా జనరల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనలో మరో యువకుడికి కూడా గాయాలయ్యాయి. గంజాయి మత్తులో ఉన్న అక్రమ్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.



Next Story

Most Viewed