బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు : బూర నర్సయ్య గౌడ్

by Disha Web Desk 11 |
బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరు :  బూర నర్సయ్య గౌడ్
X

దిశ,చండూరు: దేశ వ్యాప్తంగా బీజేపీ ప్రభంజనం కొనసాగుతుందని ఈసారి 400 లోక్ సభ స్థానాలు బీజేపీ గెలుస్తుందని బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ అన్నారు. మంగళవారం చండూరు మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఎన్నికల కార్యాలయాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. సాగునీటి పోరు యాత్రలో భాగంగా చర్ల గూడెం రిజర్వాయర్ సందర్శించినట్లు తెలిపారు. నష్ట పరిహారం అందక భూనిర్వాసితులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రస్తుత ఎమ్మెల్యే సొంతంగా డబ్బులు ఇచ్చి ఆదుకుంటానని గతంలో చెప్పిన హామీని గుర్తుచేశారు.

ప్రభుత్వ మీది, కాంట్రాక్టర్ మీ పార్టీ, ఇప్పుడు ఎమ్మెల్యే గా ఉండి కూడా నష్ట పరిహారం చెల్లింపులో నిర్లక్ష్య వైఖరి ఎందుకని ప్రశ్నించారు. నక్కలగండి ప్రాజెక్టు నత్తనడకన నడుస్తుందన్నారు.ఈ సాగునీటి ప్రాజెక్టులు పూర్తయ్యేదెప్పుడు పంట పొలాల దాహార్తి తీరేదెప్పుడు అని ప్రశ్నించారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే పెండింగ్ సాగు నీటి ప్రాజెక్టు పనుల పూర్తికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. గతంలో ఎంపీ గా పనిచేసి నియోజకవర్గానికి నవరత్నాలు అభివృద్ధి పనులు తెచ్చానన్నారు. ఈ ఎన్నికల కోసం ఇంటిటికీ బీజేపీ ప్రచారం అద్భుతంగా కొనసాగుతుందని, భువనగిరిలో

బీజేపీ గెలుపును ఎవరు ఆపలేరని ధీమా వ్యక్తం చేశారు. గతంలో ఎంపీ గా పనిచేసిన కోమటిరెడ్డి బ్రదర్స్ ఇక్కడ చేసిన అభివృద్ధి పై పేపర్ ఇవ్వగలరా అని నిలదీశారు. అన్నదమ్ములు ఆస్తులను పెంచుకొని ప్రజల ఆస్తులను మాత్రం పెంచలేదన్నారు. అంతకు ముందు బంగారిగడ్డ గ్రామంలో ఇంటింటి ప్రచారంలో పాల్గొన్నారు. ప్రజల స్పందన చూస్తుంటే బీజేపీ గెలుపు ఖాయమైందన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు దోనూరి వీరారెడ్డి, దాసరి మల్లేశం, అసెంబ్లీ కన్వీనర్ దూడల బిక్షం గౌడ్, జిల్లా ఉపాధ్యక్షుడు సోమా నర్సింహ, ఓబీసీ మోర్చా రాష్ట్ర అధికార ప్రతినిధి కోమటి వీరేశం, మండల,పట్టణ అధ్యక్షులు పందుల సత్యం గౌడ్, ముదిగొండ ఆంజనేయులు కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


Next Story

Most Viewed