- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
భూ నిర్వాసితులకు ఇచ్చిన హామీని అమలు చేయాలి : బూర నర్సయ్య గౌడ్
దిశ ,మరిగూడ: మునుగోడు అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇచ్చిన హామీని వెంటనే అమలు చేయాలని బీజేపీ భువనగిరి ఎంపీ అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం మండలంలోని శివన్నగూడ గ్రామంలో నిర్మాణంలో ఉన్న శివన్నగూడ రిజర్వాయర్ ను ఆయన పరిశీలించారు. అనంతరం నర్సిరెడ్డి గూడెం భూ నిర్వాసితుల తో సమావేశం అయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి భూనిర్వాసితులకు ఎకరాకు 10 లక్షలు, హైదరాబాద్ లో 250 గజాల ఇంటి స్థలం తోపాటు ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీ అర్హులైన ప్రతి ఒక్కరికీ ఉద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చాడని నిర్వాసితులు బూరాకు విన్నవించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… గత ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలను నమ్మి మోసపోయారని ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేస్తే భూనిర్వాసితుల అందరికీ న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. సుగుణ గూడ గ్రామంలో ఇంటింటికి తిరిగి బీజేపీ శ్రేణులు ఓట్లను అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు నాగం వర్షిత్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దోనూరి వీరారెడ్డి, రాష్ట్ర నాయకులు యాస అమరేందర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు రాజేందర్ నాయక్, పిట్టల శ్రీనివాస్ ,అశోక్ రెడ్డి, గ్యార గోపాల్ ,పరశురాం తదితరులు పాల్గొన్నారు.