- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
రోడ్డు ప్రమాదం: భర్త మృతి.. భార్యకు గాయాలు..
దిశ, నేరేడుచర్ల (చింతలపాలెం): టిప్పర్ లారీ, టీవీఎస్ ఎక్సెల్ ద్విచక్ర వాహనం ఢీకొన్న ప్రమాదంలో భర్త మృతి, భార్య గాయాలపాలైన సంఘటన సూర్యపేట జిల్లా చింతలపాలెం మండలంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ నబీబ్, భార్య సైనాబి మేళ్లచెరువు నుంచి చింతలపాలెం వస్తుండగా అదే సమయంలో చింతలపాలెంకు చెందిన టిప్పర్ లారీ చింతలపాలెం నుంచి మేళ్లచెరువు వైపు వెళ్తుంది. ఈ క్రమంలో చింతలపాలెం శివారులో రెండు వాహనాలు ఎదురెదురుగా ఢీకొట్టడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో చింతలపాలెం మండల కేంద్రానికి చెందిన షేక్ నబీ సాహెబ్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఆయన భార్య సైదాబికి గాయాలు కావడంతో ఆమెను హుజూర్నగర్ ఆసుపత్రికి తరలించారు. మృతుడి కుమారుడు సత్తార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చింతలపాలెం ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపారు.