మొదలైన 'ప్రైవేట్' వ్యాపారం.. చదువు తక్కువా ఫీజులెక్కువా ?

by Dishanational2 |
మొదలైన ప్రైవేట్ వ్యాపారం.. చదువు తక్కువా ఫీజులెక్కువా ?
X

దిశ, యాదాద్రి కలెక్టరేట్: పాఠశాలల్లో బడి గంట మోగింది. గంట శబ్దం విద్యార్థు ల్లో కొత్త ఉత్సాహం నింపుతుండగా.. వారి తల్లిదండ్రుల్లో మాత్రం వణుకు పు ట్టిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో అత్యంత లాభసాటి వ్యాపారాల్లో విద్య ఒక టిగా మారింది. ప్రజాప్రతినిధుల నుంచి వ్యాపారుల వరకూ అందరూ ఇందులో పెట్టుబడులు పెడుతున్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో ఒకవైపు కార్పొరేట్, ప్రైవేట్, ఎయిడెడ్ సంస్థలు ఫీ'జులుం' చూపిస్తూనే మరోవైపు ఇతర మార్గాల్లో కూడా డబ్బులు దండుకుంటున్నాయి. అడ్మిషన్ల టైం లోనే పుస్తకాలు, యూనిఫాం, బ్యాగు, షూలను విక్ర యిస్తూ అదనపు ఆదాయం గడిస్తున్నాయి. అది కూడా రెట్టింపు రేట్ల దోపిడీతో పుస్తకాల విక్రయాల ద్వారా ప్రైవేటు స్కూళ్లు తల్లిదండ్రుల జేబులు కాళీ చేస్తున్నాయి. అడ్మిషన్ల సమయంలో పుస్తకాలు, యూనిఫామ్, బ్యాగ్, షూస్ అన్నీ ఇక్కడే తీసుకోవాలని విద్యార్థులను ఒత్తిడికి గురి చేసి డబ్బులు దండుకుంటున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు జేబులు ఖాళీ అవుతున్నాయి. పాత బకాయిలు, కరోనా సమయంలో పెండింగులో ఉన్న ఫీజులు సైతం వసూలు చేస్తున్నారు. చెల్లించని యెడల పుస్తకాలు ఇచ్చేది లేదని ఇబ్బందులకు గురి చేస్తున్నారు. రెండేళ్ల ఫీజు ఒకేసారి చెల్లిస్తేనే పాఠ్యపుస్తకాలు ఇస్తామంటూ ఇబ్బందులకు గురి చేస్తున్నారని తల్లిదండ్రులు వాపోతున్నారు.

వలిగొండ మండల కేంద్రంలో ప్రైవేట్ పాఠశాలల దోపిడీకి అడ్డూ అదుపులేకుండా పోతోంది. జిల్లా విద్యాశాఖ, మండల అధికారులు కనీసం పట్టింపు లేకుండా వ్యవహరిస్తుండడంతో వారి కనుసన్నల్లోనే ఇదంతా జరుగుతోందని విద్యార్థి సంఘాలు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. వలిగొండ మండల కేంద్రంలోని పవిత్రాత్మ, మాంటిసోరి పాఠశాలల యాజమాన్యాలు అధిక ఫీజులు వసూలు చేసి తల్లిదండ్రుల నడ్డి విరుస్తున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కుతూ పుస్తకాలు, యూనిఫాంలను సైతం పాఠశాలలోనే విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. పవిత్రాత్మ స్కూల్లో పదో తరగతి విద్యార్థికి ట్యూషన్ ఫీజు కింద రూ.27వేలు, మోంటెస్సోరి స్కూల్లో తొ మ్మిదో తరగతి ట్యూషన్ ఫీజు కింద రూ.23,500 దీనికి అదనంగా మరో రెండు వేలు వసూలు చేస్తు న్నారు. వీటితోపాటు బుక్స్, డ్రెస్సులకు అధికంగా తీసుకుంటున్నారు. అదేకాకుండా విద్యార్థులు ఖచ్చి తంగా వారు చెప్పిన దగ్గరే బుక్స్ కొనుగోలు చే యాలని నిబంధన పెడుతున్నారని తల్లిదండ్రులు ఆ రోపిస్తున్నారు. ఇప్పటికైనా విద్యాశాఖ మేలుకొని అ ధిక ఫీజులు వసూలు చేస్తున్న ప్రైవేట్ విద్యా సంస్థల పై చర్యలు తీసుకోవాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు.


Next Story

Most Viewed