వైద్యుల నిర్లక్ష్యం తో రోగి మృతి

by Disha Web Desk 23 |
వైద్యుల నిర్లక్ష్యం తో  రోగి మృతి
X

దిశ, మిర్యాలగూడ: అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తి ని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. వన్ టౌన్ పోలీసులు కు బాధిత కుటుంబికులు తెలిపిన వివరాల ప్రకారం ..దామరచర్ల మండలం ,రాళ్లవాగు తండాకు చెందిన ధీరావత్ మల్లు నాయక్ (43) అనారోగ్య కారణాలతో ఈ నెల 26న పట్టణంలోని అంకిత ఆసుపత్రిలో చేరగా సోమవారం ఉదయం స్కానింగ్ కోసం పంపారు. అక్కడ కళ్లు తిరిగి పడిపోయిన మల్లు ని ఆసుపత్రి కి తీసుకెళ్లగా పరిస్థితి విషమంగా ఉందని గ్రహించిన డాక్టర్, అత్యవసర సేవలందించే బాలాజి హాస్పిటల్ కి అంబులెన్సు లో తరలించాడు. అప్పటికే మల్లు మృతి చెందగా, మల్లు మృతి విషయాన్ని రెండు ఆసుపత్రుల నిర్వాహకులు చాలా సేపటి వరకు బయటకు చెప్పలేదు. దీంతో ఆగ్రహించిన కుటుంబ సభ్యులు వైద్యుల నిర్లక్ష్యం వల్లే మల్లు మృతి చెందాడని ఆందోళన చేశారు. న్యాయం చేస్తామన్న వైద్యుల హామి మేరకు ఆందోళన విరమించారు. ఈ మేరకు వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు


Next Story