- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
చామాల కిరణ్ కుమార్ రెడ్డికి ఎమ్మార్పీఎస్ పూర్తి మద్దతు
దిశ, ఆత్మకూరు(ఎం) : తెలంగాణ రాష్ట్రంలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మేడి పాపయ్య మాదిగ ఆదేశాల మేరకు... కాంగ్రెస్ పార్టీకి పూర్తి మద్దతు ఇచ్చి గెలిపించాల్సిన బాధ్యత ఎమ్మార్పీఎస్ తీసుకుంటుందని, ఆలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ కుమ్మరి కుంట్ల గణేష్ మాదిగ అన్నారు. సంఘం నాయకులతో సోమవారం మండల కేంద్రంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ మాదిగలను తెలంగాణ రాష్ట్రంలో వంచించారని, పది సంవత్సరాలు ప్రభుత్వంలో ఉన్న అభివృద్ధిని సంక్షేమ పథకాలను మాదిగలకు అందనీయకుండా చేసారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో మాదిగలంతా కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు వస్తువుల స్వామి, జిల్లా నాయకులు వస్తుపుల ఎల్లయ్య, ఆత్మకూరు మండల ఎమ్మార్పీఎస్ ఇంచార్జ్ మేడి శ్రీనివాస్, పరుశరాములు, పంది రవీందర్, కానుకుంట్ల సారయ్య, కదిరే నవీన్, మేడి చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.