- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- లోక్సభ ఎన్నికలు-2024
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- IPL2024
- ఐసీసీ T20 వరల్డ్ కప్-2024
మునుగోడులో ఆ సమస్యను తరిమికొట్టిందే కేసీఆర్: మంత్రి జగదీష్ రెడ్డి
దిశ, చండూరు: మునుగోడులో ఫ్లోరోసిస్ను తరిమికొట్టింది సీఎం కేసీఆర్ అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని గట్టుప్పల్ మండలంలో మంజూరైన ఆసరా పెన్షన్లను ఆయన లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. 60 ఏళ్లుగా పాలించిన పాలకులు మునుగోడు ప్రజలను ఫ్లోరోసిస్ నుండి కాపాడలేదని, ముఖ్యమంత్రి కేసీఆర్ తోనే అది సాధ్యమైందని తెలిపారు. దేశవ్యాప్తంగా ఏ రాష్ట్రంలో అమలు చేయని సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రభుత్వం మాత్రమే అమలు చేస్తోందని పేర్కొన్నారు. మోడీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో పెన్షన్ రూ. 600 ఇస్తుంటే.. తెలంగాణలో రూ. 2016 ఇస్తున్నారన్నారు. రైతులు, చేనేత కార్మికులు ఆకలితో చనిపోతుంటే ఆ దరిద్రాన్ని తెలంగాణ రాష్ట్రం నుండి తరిమివేసింది కేసీఆర్ అని అన్నారు. రైతు బంధు, రైతు భీమా, చేనేత భీమా పథకాలను ప్రవేశపెట్టి ప్రజల సమస్యలను తీరుస్తున్న కేసీఆర్కు అండగా ఉండి ఆయన నాయకత్వాన్ని బలపర్చలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కోటి రెడ్డి, జెడ్పీటీసీ కర్నాటి వెంకటేశం, సర్పంచ్లు ఇడెం రోజా, విరమల్ల శ్రీశైలం, ఎంపీటీసీలు అవ్వారి గీతా, శ్రీనివాస్, గొరిగి సత్తయ్య పాల్గొన్నారు.