వలిగొండ పట్టణంలో దొంగల హల్చల్

by Disha Web Desk 11 |
వలిగొండ పట్టణంలో దొంగల హల్చల్
X

దిశ, వలిగొండ:- ఇటీవల కాలంలో యాదాద్రి భువనగిరి జిల్లాలోని వివిధ మండలాల్లో చైన్ స్నాచింగ్ లు జరిగిన విషయం విదితమే, కాగా శుక్రవారం రాత్రి వలిగొండ పట్టణంలోని సాయి నగర్ కాలనీలో భీమిడి మధుసూదన్ రెడ్డి ఇంట్లోకి ఇద్దరు వ్యక్తులు మాస్కులు ధరించి ప్రవేశించారు. బీరువా తాళాలు పగలగొట్టి 30 తులాల వెండి, పదివేల నగదును తీసుకొని ఇంటి మేడపై పడుకున్న మహిళలను ఇనుపరాడ్లతో బెదిరించి మూడు తులాల బంగారు పుస్తెలతాడు ను తీసుకొని పారిపోయారు. అదేవిధంగా అదే కాలనీలో రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ సత్యనారాయణ ఆరుబయట నిద్రిస్తుండగా గోడ దూకి పక్కనే ఉన్న సెల్ ఫోన్ ఎత్తుకెళ్లారు.

సమాచారం తెలిసిన అడిషనల్ డిసిపి సిహెచ్ లక్ష్మీనారాయణ, చౌటుప్పల్ ఏసిపి పటోళ్ల మధుసూదన్ రెడ్డి, స్థానిక ఎస్సై డి మహేందర్ లాల్ స్థానిక సిబ్బంది, సిసిఎస్ క్లూస్ టీమ్ బృందం ఆధారాలు సేకరించి దర్యాప్తు ముమ్మరం చేశారు. అడిషనల్ డీసీపీ లక్ష్మీనారాయణ మాట్లాడుతూ వేసవిలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ పోలీసులకు సహకరించాలని, దొంగలను త్వరలో పట్టుకొని శిక్షిస్తామని అన్నారు.

Next Story

Most Viewed