భువనగిరిలో రెండో రోజు ఐదు నామినేషన్లు దాఖలు

by Disha Web Desk 11 |
భువనగిరిలో రెండో రోజు ఐదు నామినేషన్లు దాఖలు
X

దిశ, యాదాద్రి భువనగిరి ప్రతినిధి : లోక్ సభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా రెండో రోజు శుక్రవారం నాడు ఐదు నామినేషన్లు దాఖలైనట్లు భువనగిరి పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ హనుమంత్ కే. జండగే శుక్రవారం తెలిపారు. సీపీఎం అభ్యర్థిగా మహమ్మద్ జహంగీర్ ఒక సెట్ నామినేషన్ వేశారు. బీజేపీ అభ్యర్థిగా డాక్టర్ బూర నర్సయ్య ఒక సెట్ నామినేషన్ వేశారు. సోషలిస్ట్ పార్టీ (ఇండియా) అభ్యర్థిగా రచ్చ సుభద్రా రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా మెగావత్ చందు నాయక్, రేకల సైదులు ఒక సెట్ నామినేషన్ వేశారు.

Next Story

Most Viewed