న్యాయం చేయండి...భర్త పట్టించుకోవడం లేదని భార్య నిరసన

by Disha Web Desk 11 |
న్యాయం చేయండి...భర్త పట్టించుకోవడం లేదని భార్య నిరసన
X

దిశ, నల్లగొండ: భర్త వివాహేతర సంబంధం పెట్టుకొని పట్టించుకోవడం లేదని న్యాయం చేయాలని భార్య,పిల్లలు నిరసన తెలిపిన సంఘటన నల్లగొండ పట్టణంలో ఆదివారం చోటుచేసుకుంది. భార్య, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం వల్లాపురం గ్రామానికి చెందిన వ్యక్తికి ఖమ్మం పట్టణానికి చెందిన మహిళతో 14 సంవత్సరాల కిందట వివాహం జరిగింది. వీరికి ఇద్దరు సంతానం. ప్రస్తుతం నల్లగొండ పట్టణంలోని శ్రీరామ్ చిట్స్ లో మేనేజర్ గా పనిచేస్తూ మిర్యాగలగూడ రోడ్డు లోని యాదమ్మ హాస్పిటల్ సమీపంలో నివాసం ఉంటున్నాడు. భర్త వివాహేతర సంబంధం పెట్టుకుని పెళ్లి అయినప్పటి నుంచి భార్యను వేధించసాగాడు.

ఘర్షణపడి గాయపర్చారు. కట్నం కోసం ఆడబిడ్డ, తోటి కోడలు కూడా వేధించారు. పలుసార్లు పెద్ద మనుషుల సమక్షంలో పంచాయతీ పెట్టి సర్ది చెప్పారు. అయినా కానీ మార్పు రాలేదు. రెండు సార్లు పోలీసు కేసు పెట్టారు. పోలీసులు కూడా నచ్చచెప్పారు. అయిన కానీ మార్పు రాకపోగా వేధింపులు ఎక్కువయ్యాయి. వేధింపులు ఎక్కువవడంతో భార్య పుట్టింటికి పిల్లలను తీసుకుని వెళ్ళింది. సంవత్సర కాలంగా తల్లిదండ్రుల వద్దే ఉంటుంది. భర్త వికారాబాద్ కు మకాం మారుస్తున్నాడని తెలుసుకున్న భార్య ఆదివారం ఆందోళనకు దిగింది. శ్రీరామ్ చిట్స్ యాజమాన్యం తన భర్త పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

Next Story

Most Viewed