కేసీఆర్‌కు ఏ మాత్రం విలువలు ఉన్న.. రాజకీయాల నుంచి రిటైర్ కావాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి

by Disha Web Desk 12 |
కేసీఆర్‌కు ఏ మాత్రం విలువలు ఉన్న.. రాజకీయాల నుంచి రిటైర్ కావాలి: ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మరోసారి మాజీ సీఎం కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. జిల్లావ్యాప్తంగా ప్రాజెక్టులను పూర్తి చేయకుండా నల్లగొండలో ఎలా అడుగు పెడతారని ప్రశ్నించారు. మాజీ సీఎం కేసీఆర్ కు ఏమాత్రం విలువలు ఉన్నా.. రాజకీయాల నుంచి రిటైర్ కావాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. అలాగే పార్టీలకు అతీతంగా బీఆర్ఎస్ నల్లగొండ సభను భహిష్కరించాలని.. ఆయన ప్రజలను కోరారు. అలాగే ఏపీ సీఎం జగన్ తో కేసీఆర్ కుమ్మక్కై కేఆర్ఎమ్‌బీ కి ప్రాజెక్టులు అప్పగించారిన ఆరోపించారు. కాగా ఈ నెల 13న బీఆర్ఎస్ పార్టీ అధినేత మాజీ సీఎం కేసీఆర్.. చలో నల్లగొండ సభకు పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఈ సభను భారీ ఎత్తున నిర్వహించాలని బీఆర్ఎస్ నేతలు చూస్తున్నారు. ఇందుకోసం భారీ జన సమీకరణ కూడా చేస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed